Thursday, November 13, 2025

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైకాపా ఉద్యమం?

అమరావతి, నిఘా న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యశాలల ప్రైవేటు కరణను వ్యతిరే కిస్తూ ఈనెల10 నుంచి నవంబర్ 26 వరకు గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ కార్యక్రమాల తోపాటు..కోటి సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ప్రకటించారు. దీంతో ఏపీలో రాజకీయాలు మరింత హీటెక్కాయి.

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీ కరణ అంశం చుట్టూ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరే కిస్తోంది. ఈ వ్యవహారంలో కూటమి ప్రభుత్వంతో అమీ తుమి తేల్చుకునేందుకు వైసీపీ చీఫ్ జగన్ రంగంలోకి దిగనున్నారు.

అక్టోబర్ 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శిస్తానని జగన్ చెప్పారు. అక్టోబర్ 10 నుంచి నవంబర్‌ 22 వరకు రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీ కరణపై కరపత్రాలు పంపిణీ చేస్తామన్నారు. రచ్చబండ కార్యక్రమాల ద్వారా కోటి సంతకాలను సేకరించను న్నారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరే కిస్తూ కనీసం ప్రతి పంచా యతీ నుంచి 500 మంది తో సంతకాలు సేకరించా లని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రతి నియోజకవర్గ సమన్వ యకర్త ప్రతిరోజూ రెండు గ్రామాలు సందర్శించాలి. అలాగే నియోజకవర్గాల్లో రౌండ్‌ టేబుల్స్‌ ద్వారా చైతన్య పరిచే కార్యక్రమా లు నిర్వహించాలి. అక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రా ల్లో ర్యాలీలు ఉంటాయి. నియోజకవర్గ స్థాయిలో ఉన్న అధికారికి డిమాండ్‌ పత్రాలు సమర్పించను న్నారు.

జిల్లా కేంద్రాల్లో నవంబర్‌ 12 న ర్యాలీలు ఉంటాయన్న జగన్.. ఒక జిల్లాలో తాను కూడా పాల్గొంటానని తెలిపారు.నవంబర్‌ 23న నియోజకవర్గ కేంద్రాల నుంచి సేకరించిన సంతకాలు జిల్లా కేంద్రానికి తరలిస్తామన్నారు. నవంబర్ 24న సేకరించిన సంతకాలతో కూడిన వాహ నాలను జిల్లా కేంద్రంలో జెండా ఊపి విజయవాడకు పంపుతామన్నారు.సేకరించిన ఈ సంతకాలు గవ ర్నర్‌కి అప్పగిస్తామన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular