Thursday, November 13, 2025

కర్నూలు బస్ ప్రమాదంపై వెలిచాల రాజేందర్ రావు దిగ్భాంతి

కరీంనగర్, నిఘా న్యూస్: కర్నూల్‌ జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన కావేరి ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు. మరో 21 మంది క్షేమంగా బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకుందాని హైదరాబాద్‌ వచ్చిన పలువురు సజీవదహన మయ్యారు. కర్నూలు జిల్లాకు చెందిన గొళ్ల రమేశ్‌ కుటుంబం అగ్నికి ఆహుత య్యింది. అదేవిధంగా యాదిద్రి జిల్లాకు చెందిన ఓ యువతి కూడా మృతి చెందింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాము అనే వ్యక్తి బెంగ ళూరులో ఉంటున్నారు. దీపావళి పండుగను సంగారెడ్డి పటాన్‌చెరులోని కృషి డిఫెన్స్‌ కాలనీలో నివాసం ఉండే తమ బంధువుల ఇంట్లో జరుపుకోవడానికి తన తల్లితో కలిసి వచ్చారు. గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో తల్లీ కొడుకులిద్దరు కావేరి ట్రావె ల్స్‌ బస్సులో బెంగళూరుకు బయల్దేరారు. ఈ క్రమంలో చిన్నటేకూరు వద్ద ఓ బైకును ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమయింది. దీంతో తల్లి కొడుకులు సజీవదహనమయ్యారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ప్రముఖులు పరామర్శిస్తున్నారు. కొందరు సోషల్ మీడియా వేదికగా దిగ్భాంతికి గురయ్యారు. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు తీవ్ర విచారం వ్యక్తం చేస్తారు. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో పెద్దసంఖ్యలో ప్రయాణికులు మరణించడం బాధాకరమని అన్నారు . మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular