హైదరాబాద్, నిఘా :న్యూస్ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.లేడీ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులోనే గత రెండు వారాలుగా చంచల్గూడా జైల్లో ఉన్నారు జానీ మాస్టర్.
జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పని చేసిన ఓ యువతి.. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది,బాధిత యువతి..
పిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు.. జానీ మాస్టర్పై పోక్సో చట్టం కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ పరిణామం తరువాత జానీ మాస్టర్ కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చివరికి ఆయన గోవాలో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. తొలుత జానీ మాస్టర్కు ఈ నెల 6 నుంచి 9 వరకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ తరువాత గడువు ముగియడంతో.. మళ్లీ జైలుకు వెళ్లారు. రెగ్యులర్ బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేయగా.తాజాగా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జానీ మాస్టర్ ఈరోజు సాయంత్రం చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.


