Friday, November 14, 2025

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దారుణ హత్య

హైదరాబాద్, నిఘా న్యూస్:ఉత్తరప్రదేశ్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఒకే కుటుంబా నికి చెందిన ఐదుగురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. మృతుల్లో భర్త, భార్య, ముగ్గురు బాలికలు ఉన్నారు. హత్య అనంతరం మృతదేహాలను ఇంట్లోనే దాచిపెట్టారు.

మీరట్ జిల్లా లిసాది గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుహైల్ గార్డెన్ కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికం గా తీవ్ర కలకలం సృష్టిం చింది. ఈ ఘటనపై సమా చారం అందుకున్న పోలీసు లు స్పాట్‌కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

మృతుల్లో మోయిన్, అతని భార్య అస్మా, వారి ముగ్గురు కుమార్తెలు అఫ్సా (8), అజీజా (4), అదీబా (1) ఉన్నారు. భర్త, భార్య, పిల్లలను హత్య చేసిన అనంతరం నిందితులు బాలికల మృతదేహాలను గోనె సంచిలో కట్టి పడక పెట్టెలో దాచారు.

ఇంట్లోని వస్తువులు చెల్లాచె దురుగా పడి ఉండడంతో దోపిడి కోసం వచ్చిన దుండ గులు ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

గురువారం రాత్రి మొయిన్ సోదరుడు సలీం ఇంటికి చేరుకోవడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఇంటి తలుపు లోపలి నుంచి తాళం వేసి ఉంది. ఇరుగుపొరుగు వారిని విచారించిన తర్వా త బలవంతంగా తలుపులు పగలగొట్టారు.

లోపల మోయిన్, అస్మా మృతదేహాలు నేలపై పడి ఉండగా, బాలికల మృత దేహాలను బెడ్ రూమ్‌లో బయటపడ్డాయి.

ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌ఎస్పీ విపిన్‌ తడ సహా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రైం బ్రాంచ్, ఫోరెన్సిక్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నించారు. ఇంటి చుట్టూ అమర్చిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు..

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular