హైదరాబాద్, నిఘా న్యూస్: తెలుగు రాష్ట్రాలలో రుతుపవనాలు మళ్లీ బలపడుతున్నాయనిదీని ప్రభావంతో రాబోయే మూడు, నాలుగు రోజులు దేశవ్యాప్తం గా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈశాన్య, ఉత్తరాది రాష్ర్టాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, దక్షిణాది రాష్ర్టాలైన తెలంగాణ, ఏపీల్లో రాబోయే3,4రోజులు పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురు స్తాయని అంచనా వేశారు.
బుధవారం లేదా?గురువారం నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దాన్ని ప్రభా వంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.


