Monday, August 4, 2025

కరీంనగర్ లోని హోటళ్లు, లాడ్జిల్లో ఆకస్మిక తనిఖీలు..

కరీంనగర్ (నిఘా న్యూస్ ): రానున్న ఎన్నికల సందర్బంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకునే ముందస్తు చర్యల్లో భాగంగా కమీషనరేట్ వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి కరీంనగర్ లోని అన్ని హోటళ్లు లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామన్నారు. అక్రమ డబ్బు , మద్యం , ఇతర వస్తువుల పంపిణీ చేసే చర్యలకు పాల్పడే వారిని కట్టడి చేసేలా చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఈ దాడులు కొనసాగుతాయని వారు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఎన్నికల నియమావళిని పాటించాలని , ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు చేపడతామని అన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular