కరీంనగర్, నిఘా న్యూస్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కు భారత రత్న రావటం పట్లరాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మాత్యులు పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. పీవీ జాతి మరువ లేని నేత అని, దేశ ఆర్థిక వ్యవస్థ కు పివి ఆయువుపట్టుగా నిలిచాడు అని అన్నారు. పీవీ చేపట్టిన ఆర్థిక సంస్కరణ ల ఫలాలే ప్రస్తుతం దేశం అనుభవిస్తుంది అని అన్నారు. ఏఐ సిసి అధ్యక్షులుగా పీవీ ఉన్నపుడు, ఎన్ ఎస్ యూ ఐ అధ్యక్షుని గా పీవిని చాలా సార్లు కలిసిన అనుభవం ఉందని మంత్రి పొన్నం అన్నారు. పీవీ పుట్టిన గడ్డకు హుస్నాబాద్ ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని మంత్రి పొన్నం అన్నారు.
పీవీ కి భారత రత్న రావటం చాలా గర్వంగా ఉంది : పొన్నం ప్రభాకర్
RELATED ARTICLES