Wednesday, April 15, 2026

నేటి నుంచి కొండగట్టులో చిన్న జయంతి ఉత్సవాలు షురూ!

జగిత్యాల , నిఘాన్యూస్: జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆల యంలో భక్తి పారవశ్యం నిండిన వాతావరణం నెలకొంది. స్వామి వారి చిన్న జయంతి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమ వుతున్న నేపథ్యంలో ఆల య పరిసరాలు ఉత్సవ శోభతో కళకళలాడుతు న్నాయి.

ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశ మున్నందున, నిర్వహణలో ఎటువంటి అంతరాయం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అంజనా రెడ్డి కీలక ప్రకటన చేశారు.

ఉత్సవాల నిర్వహణలో భాగంగా నేటి నుంచి మూడవ తేదీ వరకు అన్ని రకాల ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే, భక్తుల ముఖ్య ఆచారాలను కొనసాగిం చేందుకు కేశ ఖండనం, మాలా విరమణ, ప్రత్యేక దర్శనం సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతా యని స్పష్టం చేశారు.

ఉత్సవాల సమయంలో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, భద్రతా ఏర్పాట్లు, క్యూలైన్ నిర్వహణ, తాగునీరు, పారిశుధ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం పొందేందుకు భక్తులు సహకరించాలని కోరారు.

మూడవ తేదీతో చిన్న జయంతి ఉత్సవాలు ముగిసిన అనంతరం, నాలుగవ తేదీ నుంచి తిరిగి అన్ని రకాల ఆర్జిత సేవలు యథావిధిగా ప్రారంభమవుతాయని ఆల య ఈవో వెల్లడించారు. భక్తులు ఈ మార్పులను గమనించి తమ దర్శన కార్యక్రమాలను అను గుణంగా ప్లాన్ చేసు కోవాలని సూచించారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular