కరీంనగర్, నిఘా న్యూస్: ఈ నెల 11, 14, 17 తేదీలలో మూడు విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళేటపుడు ఓటరు గుర్తింపు కార్డు లేని పక్షంలో ఇతర 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక దానిని తమ వెంట తీసుకెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.
1) ఆధార్ కార్డు
2) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డు
3) ఫోటోతో కూడిన పోస్ట్ ఆఫీస్/ బ్యాంక్ పాస్ బుక్
4) కార్మిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు
5) డ్రైవింగ్ లైసెన్స్
6) పాన్ కార్డ్
7) ఫోటోతో కూడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల ధృవీకరణ పత్రాలు
8) ఇండియన్ పాస్పోర్ట్
9) ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్
10) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలచే జారీ చేయబడిన ఉద్యోగ గుర్తింపు కార్డు
11) ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇచ్చిన అధికారిక గుర్తింపు కార్డు
12) దివ్యాంగుల గుర్తింపు కార్డు
13) పట్టాదార్ పాస్ పుస్తకం
14) రేషన్ కార్డు
15) ఫోటోతో కూడిన ఆయుధ లైసెన్స్ పత్రం
16) ఫ్రీడం ఫైటర్ ఐ.డీ కార్డ్
17) ఆర్జీఐ ద్వారా జారీ చేయబడిన ఎన్.పీ.ఆర్. స్మార్ట్ కార్డు
18) ఏంపీ లకు జారీ చేయబడిన గుర్తింపు కార్డు
పై వాటిలో ఏదైనా ఒక దానిని చూపించి ఓటు వేయవచ్చని కలెక్టర్ అన్నారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు


