కరీంనగర్, నిఘా న్యూస్: ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకవడం ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన విషయం చూశాం.. కానీ కొందరు పట్టా భూమలపై కూడా కన్నేస్తున్నారు. సాక్షాత్తూ రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములు కూడా తమవే అంటూ కొందరు వదంతులు సృష్టిస్తున్నారని ఓ భూ యజమాని ఆవేదన చెందుతున్నాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజ్ పల్లె గ్రామంలని 407 సర్వే నెంబర్ లోని 72 గుంటల భూమి కొన్నేళ్ల కిందటే రిజిస్ట్రేషన్ అయి పట్టా పొందింది. అయితే ఈ భూమి సీలింగ్ కు చెందినవి అని కొందరు ప్రజాప్రతినిధులు వదంతులు సృష్టిస్తున్నారని ఈ భూమికి సంబంధించిన యజమానులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఎమ్మార్వో కార్యాలయం నుంచి సర్టిఫికెట్ ఇచ్చినా.. వదంతులు ఆపడం లేదని అంటున్నారు.
పట్టాభూములపై వదంతులు.. భూ యజమానుల ఆవేదన..
RELATED ARTICLES