కడప, నిఘాన్యూస్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి, టిడిపి పార్టీకి చెందిన సీనియర్ నేత మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు, కుమారుడు సుబ్రహ్మణ్యం వైఎస్ఆర్ సీపీలో చేరాలని, నిర్ణయించుకున్నట్టు తెలిసింది,ఉమ్మడి కడప జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం నేడు వైసీపీలో చేరనున్నారు.వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో సుగవాసి వైసీపీలో చేరనున్నారు. మాజీ టీడీపీ నేత బాలసుబ్రమణ్యం ఇప్పటికే రాయచోటి నుండి విజయ వాడకు బయల్దేరారు. బుధవారం మధ్యాహ్నం ఒకటిన్నరకు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో బాలసుబ్రమణ్యం జగన్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకోనున్నారు.రాయచోటి నియోజకవర్గం లో బలమైన నేతగా ఉన్న సుబ్రహ్మణ్యం రాకతో.. వైసీపీకి మరింత బలం చేకూరనుంది. బాలసుబ్ర మణ్యం పార్టీని వీడడం రాజకీయంగా టీడీపీకి దెబ్బే అనే చెప్పాలి.టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయు డు పెద్ద కుమారుడే బాలసు బ్రమణ్యం. సుగవాసి కుటుంబం నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదికే బాలసుబ్రమణ్యం టీడీపీకి బై బై చెప్పారు. ఇటీవలి పరిణామాలు తమను టీవీరంగా బాధించాయంటూ పార్టీకి రాజీనామా చేశారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ.. తనకు ప్రాధాన్యం దక్కలేదనే అసంతృప్తిలో ఉన్నారు. అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రాజుకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. అంతేకాదు తండ్రి పాల కొండ్రాయుడు చనిపోతే.. కనీసం టీడీపీ పార్టీ తరపున ఒక్కరు కూడా అంత్యక్రియల్లో పాల్గొనేందు కు రాకపోవడం ఆయన్ను బాగా హర్ట్ చేసింది.ఈ పరిణామాల నేపథ్యం లో టీడీపీలో కొనసాగడం ఇష్టం లేని సుగవాసి బాలసుబ్రమణ్యం.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. నేడు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.