Thursday, June 26, 2025

నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ 9 రాకెట్

హైదరాబాద్, నిఘా న్యూస్: భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసిలోకి పయనమయ్యా రు. ఆయనతో కలిసి మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకొని యాక్సియం -4 నింగిలోకి దూసుకెళ్లింది. ప్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ లో బుధ వారం మధ్యాహ్నం 12.01 గంటలకు చేపట్టిన ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం విజయ వంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.ఈ ప్రయోగం మే29న జరగాల్సి ఉన్నప్పటికీ పలు దఫాలుగా వాయిదాపడు తూ వచ్చింది. ఈ ప్రయో గంలో శుభాంశు మిషన్ పైలట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శుభాంశు శుక్లాతోపాటు మిషన్‌ కమాండర్‌ పెగ్గీ విట్సన్‌ అమెరికా, స్పెషలిస్టులు టిబర్‌ కపు,హంగరీ, స్లావోస్జ్‌ ఉజ్నాన్స్‌కీ- విస్నియెస్కీ పోలండ్‌, రోదశిలోకి వెళ్లారు.ప్రయోగం సక్రమంగా జరిగితే.. భారత కాలమానం ప్రకారం.. గురువారం సాయంత్రం 4.30 గంటలకు వీరి వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం అవుతుంది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular