హైదరాబాద్, నిఘా న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో క్యాబినెట్ భేటీ కానుంది. మంత్రివర్గం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదన పోలవరం బనకచర్ల లింకు ప్రాజెక్టు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించింది, పరిపాలనలో భాగంగా నెలకు రెండు సార్లు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించినట్టు తెలుస్తుంది,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందన్న ఆందోళన నేపథ్యంలో ఈ క్యాబినెట్ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రకటించేందుకు క్యాబినెట్ సమావేశం నిర్వహి స్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ప్రధాన కర్తవ్యం స్థానిక సంస్థల ఎన్నికలే. అయితే….
ఎన్నికలకు వెళ్లే ముందు అసలు క్షేత్రస్థాయిలో పరిస్థి తులు ఎలా ఉన్నాయో, ప్రభుత్వ పథకాలపై లబ్దిదా రుల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలను ఆ జిల్లాల ఇన్చార్జి మంత్రుల ద్వారా సీఎం తెలుసుకునే అవకాశం ఉన్నది. తొమ్మిది రోజుల్లో రైతుభరోసా పూర్తి చేస్తామంటూ ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన విధంగానే ఆ ప్రక్రియ పూర్తి కావొస్తున్నది.దీంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల గుర్తింపు, బేస్ మెంట్ లెవల్ పూర్తయిన ఇండ్లకు నిధుల విడుదల వంటి అంశాలపై క్యాబినెట్లో చర్చించను న్నారు. వీటన్నింటిపై ఇన్చార్జి మంత్రులు జిల్ల్లా ల్లోని ఉన్నతాధికారులతో ఇప్పటికే సమీక్షలు నిర్వహించారు.
దీంతోపాటు మంత్రుల క్షేత్రస్థాయి పరిశీలనాంశా లనూ క్యాబినెట్లో ప్రస్తావించనున్నారు. వీటన్నింటి ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగల్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.