కరీంనగర్, నిఘా న్యూస్: తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి అందిస్తోంది. దీంతో రేషన్ షాపులు రద్దీతో ఉంటున్నాయి. గత ఉగాది నుంచి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో చాలామంది రేషన్ బియ్యాన్ని తీసుకునేందుకు క్యూ కడుతున్నారు. అయితే రేషన్ బియ్యం విషయంలో గతంలో అక్రమాలు జరిగేవని.. వాటిని అడ్డుకట్ట వేసేందుకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని ప్రజా ప్రతినిధులు తెలుపుతున్నారు. అయితే ఈ రేషన్ బియ్యం లో కొన్నిచోట్ల ప్లాస్టిక్ బియ్యం వచ్చినట్టు కొందరు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ లోని ఓ రేషన్ షాపులో తీసుకున్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం వచ్చినట్లు కొందరు పేర్కొంటున్నారు. అయితే రేషన్ బియ్యం విషయంలో అధికారులు పగడ్బందీగా ఉండాలని కొందరు కోరుతున్నారు. గతంలో ప్లాస్టిక్ బియ్యం మార్కెట్లోకి వచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. కొన్ని రకాల వీడియోలు కూడా బయటపడ్డాయి. దీంతో చాలామంది బియ్యం కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పడ్డారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యం లోనూ ప్లాస్టిక్ బియ్యం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై అధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
రేషన్ షాపుల్లో ప్లాస్టిక్ బియ్యం?
RELATED ARTICLES