కరీంనగర్ ఫిబ్రవరి (నిఘా న్యూస్)కరీంనగర్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెలిచాల రాజేందర్ రావు, రాజకీయ విశారదుడు వెలిచాల జగపతిరావు వారసుడిగా, ఆయన చూపిన మార్గంలో ప్రజాసేవ చేస్తూ ముందుకు సాగుతున్నారు. వెలిచాల జగపతిరావు, కరీంనగర్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకుడు. ఆయన ప్రజా సమస్యలపై అపారమైన అవగాహనతో, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు పనిచేశారు. ఈ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు రాజేందర్ రావు కూడా కృషి చేస్తూ, వివిధ హోదాల్లో సేవలందించారు.
వెలిచాల రాజేందర్ రావు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగి, 2024లో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనకు పార్టీ అధిష్టానం నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చింది. అయితే, పార్టీ అంతర్గత విభేదాలు, గ్రూపు రాజకీయాలు ఎన్నికల ఫలితంపై ప్రభావం చూపడంతో విజయం సాధించలేకపోయారు.
ఓటమి అనంతరం కూడా రాజేందర్ రావు పార్టీకి అంకితభావంతో కొనసాగుతానని ప్రకటించడం, ఆయన నాయకత్వ గుణాలకు నిదర్శనం. కానీ, ఎన్నికల అనంతరం ఆయనకు తగిన గుర్తింపు లభించకపోవడం, నామినేటెడ్ పదవి కోసం ఎదురు చూడాల్సి రావడం, ఆయనలో కొంత అసంతృప్తిని కలిగించిందని సమాచారం.
2024 ఎన్నికల్లో ఓటమి అనంతరం, పార్టీ ఆయనకు నామినేటెడ్ పదవి ఇస్తుందని ఆశించినా, ఇప్పటివరకు ఎలాంటి అవకాశం రాలేదు. ప్రస్తుతం జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆయనకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని అభిమానులు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వెలిచాల రాజేందర్ రావు తన సహనంతో, నిబద్ధతతో, పార్టీలో కొనసాగుతూ ప్రజాసేవ చేయాలని సంకల్పం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఎప్పుడూ ఊహించని మార్పులు ఉంటాయి. ఆయన చూపిస్తున్న విధేయత, పట్టుదల, ప్రజాసేవ పట్ల నిబద్ధత, భవిష్యత్తులో ఆయనకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది.
వెలిచాల జగపతిరావు రాజకీయ వారసుడిగా ప్రజాసేవలో నిలదొక్కుకోవాలని, పార్టీ అతనికి తగిన గౌరవం ఇవ్వాలని అనేక మంది ఆశిస్తున్నారు. పార్టీ అధిష్టానం భవిష్యత్తులో ఆయన సేవలను గుర్తించి, సరైన హోదా అందిస్తుందా? లేదా? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది.
రాజకీయాల్లో విజయం, ఓటమి సహజం. వెలిచాల రాజేందర్ రావు ఇప్పుడు తన పట్టుదల, ప్రజా సేవపై అంకితభావంతో, మళ్లీ తన స్థానం పెంచుకునే దిశగా ముందుకు సాగుతున్నారు. పార్టీ భవిష్యత్తులో ఆయనకు సరైన గుర్తింపు ఇస్తే, కాంగ్రెస్ పార్టీకి ఆయన నుంచి మరింత మద్దతు లభించే అవకాశం ఉంటుంది. రాజకీయ అనుభవం, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న నాయకుల్ని గుర్తించి, పార్టీ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
భవిష్యత్తులో వెలిచాల రాజేందర్ రావు మళ్లీ ప్రజల్లోకి వెళ్లి, రాజకీయంగా మరింత బలంగా ఎదుగుతారని అభిమానులు కోరుకుంటున్నారు.


