Sunday, August 3, 2025

లడ్డు వేడుకలో విషాదం?

హైదరాబాద్, నిఘా న్యూస్:ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. బాగ్‌పత్‌ లో ఆదినాథుడి ఆలయంలో లడ్డూ వేడుక నిర్వహిస్తుండగా చెక్కతో నిర్మించిన వేదిక ఒక్కసా రిగా కుప్పకూలిపోయింది ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరా ల ప్రకారం.. బరౌత్‌లోని జైన్‌ కమ్మూనిటీ ఇవాళ ‘లడ్డూ మహోత్సవ్‌’ ను నిర్వహించింది. ఈ కార్యక్ర మంలో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆదినాథుడి ఆలయానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా భక్తుల కోసం నిర్వాహకులు చెక్క తో వేదికను నిర్మించారు. అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో బరువు ఎక్కువై వేదిక ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది.

ఈ ఘటనలో ఇప్పటి వరకూ ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 50 మంది గాయపడ్డారు. ఘట న సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడి కి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగా త్రులను సమీపంలోని ఆసు పత్రులకు తరలించారు.

స్వల్ప గాయాలైన వారికి ప్రథమ చికిత్స అనంతరం ఇంటికి పంపించారు. తీవ్ర గాయాలతో పలువురు చికిత్స పొందుతున్నట్లు బాగ్‌పత్‌ పోలీస్‌ చీఫ్‌ అర్పిత్‌ విజయవర్గియా తెలిపారు.

మరోవైపు ఈ ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు. ప్రమాదం గురించి అధికారులను ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిం చాలని ఆదేశించారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular