న్యూఢిల్లీ, నిఘా న్యూస్:లిక్కర్ స్కామ్ లో జైలులో ఉన్న కవితకు నేడు బెయిల్ లభించింది.. సుప్రీం కోర్టు నేడు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది..ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వ నాథన్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరపున సీనియర్ న్యాయ వాది ముకుల్ రోహత్గా, ఈడీ తరపున ఏఎస్పీ వాదనలు వినిపించారు.
ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై నేడు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మా సనం విచారణ చేపట్టగా.. కవిత తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.కవితకు బెయిల్ పొందే అర్హత ఉందని తెలిపారు.ఇప్పటికే కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు ముగి శాయని రోహత్గీ తెలిపారు. ఈడీ, సీబీఐ కేసులో ఇప్ప టికే విచారణ పూర్తయ్యిం దని న్యాయ వాది ముకుల్ రోహత్గీ తెలిపారు.
ఈడీ కేసులో 5 నెలలుగా కవిత జైల్లో ఉన్నారని అన్నారు. సీబీఐ కేసులో 4 నెలలుగా జైలులో ఉన్నా రని చెప్పారు. ఈ కేసులో మొత్తం 493 మంది సాక్షుల విచారణ ముగిసిం దని అన్నారు. కేసులో ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేశారని తెలిపారు.కవిత దేశం విడిచి పారిపోయే అవకాశం లేదని రోహత్గీ అన్నారు. కవితకు బెయిల్ పొందే అర్హత ఉందని తెలిపారు. రూ.100 కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు మాత్రమే అని అన్నారు.
దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కవిత ఇచ్చారని చెప్పారు. ఫోన్లు మార్చ డంలో తప్పేముందని ప్రశ్నించారు. సౌత్ గ్రూప్ 100 కోట్లు అంటున్నారని.. కానీ దాన్ని రికవరీ చేయలే దని తెలిపారు.493 మంది సాక్షులను విచారించారని అన్నారు. సాక్షులను బెదిరించారని చెబుతున్నారని.. కానీ ఎక్కడా ఎందుకు కేసులు నమోదు కాలేదని ప్రశ్నించారు. కవిత ఎవరినీ బెదిరించలేదని స్పష్టం చేశారు.
విచారణలో తీవ్ర ఆలస్యం జరుగుతుందని అన్నారు. సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకు వర్తిస్తాయని తెలిపారు.ధర్మాసనం .కవితను రెండేళ్లుగా వాడిన మొబైల్ ఫోన్ల ను అడిగామని,
కవిత వాటిని ఇచ్చారని తెలిపారు .అయితే మొబైల్ ఫోన్లను ఫార్మాట్ చేసారా.?.డేటా డిలీట్ చేసారా అని అడిగామని, అందుకు కవిత తనకు తెలీదు అన్న సమాధానాలు ఇచ్చారన్నారు….


