విజయవాడ, నిఘా న్యూస్:గుండెపోటుతో బస్సులోనే కుప్పకూలిపోయింది ఓ మహిళ,అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న వారు సైతం అకస్మాత్తుగా గుండెపోటుతో రోజు రోజుకు చనిపోతున్న ఘటనలు పెరుగుతున్నా యి.ఇలాంటి విషాద ఘటన ఏపీలో తాజాగా జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుమామిడికి చెందిన ఓ మహిళ ఉపాధి నిమిత్తం మస్కట్ వెళ్లింది.
అక్కడి నుంచి తిరిగి వచ్చింది. విజయవాడ నుంచి స్వగ్రామం కోరు మామిడి కీ బస్సులో వెళ్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో బస్సులోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది.సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది….