హైదరాబాద్, నిఘా న్యూస్: ద్విచక్ర వాహన తయారీదారులకు కేంద్రం కీలక సూచన చేసింది. వాహనం కొనుగోలు సమయంలో రెండు హెల్మెట్ లను అందించడం తప్పనిసరి చేసింది. ఈ కొత్తనియమాన్ని అమల్లోకి తీసుకురావడానికి రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ కేంద్ర మెటారు వాహనాల నిబంధనలు 1989కి ముఖ్య సరవరణలను ప్రతిపాదిస్తూ ముసాయిదా విడుదల చేసింది. జూన్ 23, 2025న ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం..
కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన మూడో నెల నుంచి ద్విచక్ర వాహన తయారీ దారులు, కొనుగోలు దారు లకు రెండు హెల్మెట్లను అందించాలి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సూచించిన స్పెసిఫికేషన్లకు అనుగుణంగా తయారు చేసిన హెల్మెట్లనే కొనుగోలుదారులకు అందించాల్సి ఉంటుంది.
అదేవిధంగా ఇంజిన్ సామర్థ్యంతో సంబంధం లేకుండా వచ్చే ఏడాది జనవరి నుంచి తయారయ్యే అన్ని ద్విచక్ర వాహనాలకు యాంటీ-లాక్ బ్రేకింగ్ వ్యవస్థను తప్పని సరి చేస్తూ కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయాణికుడి భద్రత కోసం దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది.
ఆకస్మికంగా బ్రేక్ వేసినప్పు డు చక్రాలు లాక్ అవ్వ కుండా నిరోధించడానికి, జారిపోయే, క్రాష్ అయ్యే ప్రమాదాన్ని తగ్గించడానికి యాంటీ-లాక్ బ్రేకింగ్ వ్యవస్థ దోహదపడుతుంది.