Wednesday, August 6, 2025

నెగ్గిన అవిశ్వాస తీర్మానం..

రామడుగు, నిఘా న్యూస్:మార్చి 2024.. రామడుగు మండలా ఎంపిపి కలిగేటి కవితపై ఏర్పాటు చేసిన అవిశ్వాస తీర్మానం పెట్టగలకే నెగ్గింది. వివరాల మేరకు కరీంనగర్ జిల్లా రామడుగు మండల అభివృద్ధి కార్యాలయంలో శనివారం జిల్లా ఆర్డీవో మహేశ్వర్ అధ్యక్షతనలో అవిశ్వఆర్డర్్మానం ఏర్పాటు చేయడం జరిగింది. కొద్ది నెలల క్రితం ఎంపీపీ కలిగేటి కవితపై అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేస్తూ సంబంధిత ఆర్డీవోకు వినతిపత్రం అందజేయడం జరిగింది. కాగా అట్టి సమయంలో ఎంపీపీ కలిగేటి కవిత హైకోర్టును ఆశ్రయించి స్టేటస్ తీసుకురావడం జరిగింది. అట్టి స్టే ఆర్డర్ నేటితో ముగియడంతో ఎంపీటీసీల సభ్యుల బృందం అవిశ్వాస తీర్మానానికి ఏకగ్రీవంగా సంబంధిత ఆర్డిఓ అధికారి ముందు చేతులు ఎత్తడంతో ఏకగ్రీవంగా నెగ్గింది. రామడుగు మండలంలో మొత్తం 14 మంది ఎంపీటీసీల సభ్యుల బృందం ఉండగా అందులో ఒకరు రాజీనామా చేశారు. మిగతా 12 మంది సభ్యులు నేటి శనివారం నాడు ఏకగ్రీవంగా చేతులు ఎత్తి అవిశ్వాస తీర్మానాన్ని దించుకున్నారు. ఈ సందర్భంగా ఈ 12 మంది ఎంపీటీసీ సభ్యులలో ఎవరు ఎంపీపీ అనేది ఇంకా కొలిక్కి రాకపోవడం కొసమెరుపు. వరకు వైస్ ఎంపీపీ గా కొనసాగుతున్నటువంటి పూరెల్ల రాజగోపాల్ అధ్యక్షతన వహిస్తున్నట్లు ఎంపీడీవో రాజేశ్వరి పేర్కొన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular