Sunday, February 2, 2025

వచ్చేనెల ఫిబ్రవరి 5న తెలంగాణ కెబినెట్ సమావేశం

హైదరాబాద్ నిఘా న్యూస్:స్థానిక సంస్థల ఎన్నికల కోసం రేవంత్ సర్కార్ కసరత్తు వేగవంతం చేసి నట్లు సమాచారం. ఇందు కోసం బీసీ రిజర్వేషన్ల పెం పుపై దృష్టి సారించిందని సమాచారం.దీనిలో భాగంగానే కులగణన సర్వే నివేదికను ఫిబ్రవరి 2న కేబినెట్ సబ్ కమిటీకి అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గురువారం సాయంత్రం అధికారులను ఆదేశించారు.

ఈ మేరకు ఫిబ్రవరి 5వ తేదీన కేబినెట్ ప్రత్యేక సమావేశం నిర్వహించి నివేదికను ఆమోదించను న్నట్లు తెలుస్తోంది.ఆ తర్వాత ఫిబ్రవరి 7న ఒక్క రోజు శాసనసభ సమావేశం నిర్వహించి కులగణన సర్వే నివేదికను ఆమోదింపజేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈమధ్యే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతోనూ చర్చించి..సమా వేశానికి అనుమతి తీసుకున్నట్లు సచివాలయ వర్గాలు పేర్కొన్నాయి. అసెంబ్లీ ఆమోదం తర్వాత తదుపరి కసరత్తు పూర్తి చేసి మార్చిలో స్థానిక సంస్థ ల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ మార్చి మొదటివారం వరకు అమల్లో ఉంటుంది. దీన్ని కొనసాగిస్తూ మార్చి రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular