కరీంనగర్, నిఘా న్యూస్: శ్రీరామనవమి సందర్భంగా దేశ వ్యాప్తంగా సీతారముల కల్యాణ వేడుకలు అంగరంగా వైభవంగా జరిగాయి. ఊరూ , వాడల్లోని రామాలయాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో అశేష భక్త జనం హాజరై రామ కల్యాణాన్ని ఆసక్తిగా తిలకించారు. ఇందులో భాగంగా కరీంనగర్ లోని ప్రధాన ఆసుపత్రి వద్ద ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కల్యాణం రమణీయంగా సాగింది. ఈ వేడుకను తిలకించేందుకు సుమారు 2,500 మంది భక్తులు హాజరయ్యారు. జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించి ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చీకట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతీ ఏడాది ఎంతో భక్తితో సీతారాముల కల్యాణం నిర్వహిస్తామని అన్నారు. భక్తులు హాజరై రాముని సేవలో
పరితపించాలని ఆయన కోరారు. ఈసారి నిర్వహించిన వేడుకలకు భక్తుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని తెలిపారు.