మంచిర్యాల, నిఘా న్యూస్ : డాక్టర్లు, అంబులెన్స్ డ్రైవర్ లు కలిసి రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన పేషంట్ అవయవాలు అమ్ముకున్న సంఘటన మంచిర్యాల పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శెట్పల్లికి చెందిన రేవెల్లి శ్రీకాంత్(35) వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురవ్వగా కరీంనగర్ తీసుకెళ్లగా బ్రెయిన్ డెడ్ అయిందని హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. ఆ ఆస్పత్రిలో ఒక అంబులెన్స్ డ్రైవర్ కామినేనిలో తక్కువ ఖర్చు అవుతాయని సలహా ఇచ్చాడు.

అనంతరం ఎన్ని రోజులు ఉన్నా డబ్బులు ఖర్చు తప్ప ప్రయోజనం ఉండదని అతని అవయవాలు దానం చేస్తే పుణ్యం వస్తుందని, ఇప్పటి వరకు ఉన్న హాస్పిటల్ బిల్లు కట్టాల్సిన పని లేకపోగా అవయవాలు ఇస్తే 3 లక్షలు ఇస్తామని శ్రీకాంత్ భార్యను ఒప్పించి శ్రీకాంత్ అవయవాలు జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా డాక్టర్లు అంబులెన్స్ డ్రైవర్ కలిసి లక్షల్లో అమ్ముకున్నారు. విషయం తెలుసుకున్న శ్రీకాంత్ భార్య మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరపగా లక్షల్లో చేతులు మారాయని ప్రాథమిక విచారణలో తేలింది.శ్రీకాంత్ భార్య పిర్యాదు మేరకు మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.