తేదీ 29-02-2024.
కరీంనగర్.
కరీంనగర్, నిఘా న్యూస్: ఫెమిలైజేషన్ ఎక్ససైజ్ లో భాగంగా కరీంనగర్ కు విచ్చేసిన రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలతో గురువారం నాడు కరీంనగర్ టౌన్ డివిజన్ లోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ఫ్లాగ్ మార్చినందు ఆర్ ఏ ఎఫ్ బలగాలతో పాటు స్థానిక పోలీసులు మరియు స్పెషల్ యాక్షన్ టీం పోలీసులు పాల్గొన్నారు. కరీంనగర్ కమాన్ నుండి ప్రారంభమైన ఈ ఫ్లాగ్ మార్చ్ షిప్ జంక్షన్, అశోక్ నగర్, నాఖాచౌరస్తా, పాత శివాలయం, రాజీవ్ చౌక్ మీదుగా టవర్ సర్కిల్ వరకు కొనసాగింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సేవలు వినియోగించనున్నామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ అడిషనల్ కమాండెంట్ బిస్వ రంజన్ సాహు అడిషనల్ డీసీపీ సి రాజు, ఏసీపీ నరేందర్,, ఇన్స్పెక్టర్ లు రవీంద్ర రోషన్ (ఆర్. ఏ. ఎఫ్) లలితగోప్ నారాయణ్ (ఆర్ . ఏ. ఎఫ్) , సరిలాల్, శ్రీనివాస్ , సురేష్, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.