Sunday, March 22, 2026

పెద్దపల్లి జిల్లాల్లో ఘనంగా రంజాన్ వేడుకలు

పెద్దపల్లి, నిఘా న్యూస్ :మార్చి 21తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులు ఈ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి, రామగుండం, మంథని, నియోజకవర్గా ల్లోని దర్గాలలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ పర్వదినం విశిష్టతను వివరిస్తూ మత పెద్దలు హితబోధ చేశారు. అదేవిధంగా పేద ముస్లిం కుటుంబాలకు దాన ధర్మాలు నిర్వహించారు. పండుగ సందర్భంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రామగుండంలో ఈద్గాల వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, మేయర్ మహంకాళి స్వామి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభు త్వం కట్టుబడి ఉందని తెలిపారు. అదేవిధంగా బడ్జెట్లో సైతం పెద్ద ఎత్తున మైనార్టీ సంక్షేమానికి ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నా రు. రంజాన్ పర్వదినం సంద ర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పెద్దపల్లి డిసిపి రామ్ రెడ్డి తెలిపారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular