హైదరాబాద్, నిఘా న్యూస్:ఐపీఎల్ 2025 రసవత్తరంగా సాగిపోతోంది. నేడు మరో పోరుకు సర్వం సిద్ధమవుతోంది. ఇవాళ గుజరాత్ టైటాన్స్, రాజ స్థాన్ తో తలపడనుంది.IPL 2025లో గుజరాత్ టైటాన్స్ భీకర ఫామ్లో ఉంది. శుభ్మాన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్లలో 6 మ్యాచ్ల్లో గెలిచి, రెండు మ్యాచ్ల్లో ఓడిపోయింది. గుజరాత్ జట్టు 12 పాయింట్లతో కొనసాగుతోంది.
గుజరాత్ తన చివరి మ్యాచ్లో KKRను 39 పరుగుల తేడాతో ఓడించింది. రాజస్థాన్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. గుజరాత్, రాజస్థాన్ మధ్య మ్యాచ్ జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగనుంది.
గుజరాత్, రాజస్థాన్ ఆడిన మొత్తం మ్యాచ్లు- 7
రాజస్థాన్ గెలిచింది- 1
గుజరాత్ గెలిచింది- 6
ఫలితం తేలనిది – 0
సవాయి మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్, రాజస్థాన్ మధ్య జరిగిన మొత్తం మ్యాచ్లు- 2 ఆడిన రెండు మ్యాచ్ ల్లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది
సవాయి మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ విజయం-0
సవాయి మాన్సింగ్ స్టేడియం పిచ్ గురించి మాట్లాడుకుంటే.. అది బ్యాట్స్మెన్, బౌలర్లు ఇద్దరికీ అనుకూలంగా ఉంటుంది. ఈ మ్యాచ్ ప్రారంభంలో బౌలర్లకు అనుకూలం. కానీ ఆట ముందుకు సాగుతున్న కొద్దీ, బ్యాట్స్మెన్కు పరుగులు సాధించడంలో సపోర్ట్ చేస్తుంది. బ్యాట్స్మెన్ ఎక్కువ పరుగులు సాధించడానికి అవకాశం ఉంటుంది.