Monday, August 4, 2025

కరీంనగర్ కమిషనరేట్ ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి..

కరీంగనర్, నిఘా న్యూస్: లోకసభ ఎన్నికల కోడ్ ప్రకటించబడి, మే నెల 13వ తేదీన ఎన్నికలు ఉన్నందున, ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల విధుల్లో పోలీసులు నిమగ్నమై ఉంటారని, కరీంనగర్ కమీషనరేట్ కంప్లైంట్ సెల్ నందు ఎటువంటి ఫిర్యాదులు స్వీకరించబడవని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిబంధనలు రేపటి నుండే అనగా తేదీ 22 ఏప్రిల్ 2024 రోజు నుండే అమల్లోకి వస్తాయని తెలిపారు. ఎన్నికలు ముగిసిన అనంతరం అనగా మే 14 వ తేదీ నుండి కమీషనరేట్ కంప్లైంట్ సెల్ నందు ఫిర్యాదుల స్వీకరణ యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు.ఇట్టి విషయాన్నీ ప్రజలు గమనించి, సహకరించగలరని విజ్ఞప్తి చేసారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular