హైదరాబాద్, నిఘా న్యూస్:తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో నేడు ఈడి సోదాలు జరుగుతుంది, ఈరోజు ఉదయం నుంచి ఏకకాలం లో 16 ఈడి బృందాలు తనిఖీ చేస్తున్నాయి.మొత్తం 15 చోట్ల ఏకకాలం లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ 15 ప్రాంతాల్లో శ్రీనివాస రెడ్డికి చెందిన ఫార్మా, రియలెస్టేట్ కంపెనీల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.ఖమ్మంలోని ఆయన నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నట్టు సమా చారం. ఈడీ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చినట్టు తెలుస్తుంది,సీఆర్పీఎఫ్, పోలీసుల భద్రత మధ్య సోదాలు జరుగుతున్నట్టు సమాచారం..
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఇడి సోదాలు?
RELATED ARTICLES


