కరీంనగర్, నిఘా న్యూస్: కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్ మామిడికుంట చెరువు మత్తడి నాలా క్రమక్రమంగా కబ్జాకు గురవుతున్నది. గతంలో చెరువులోకి ఎంత వరద వస్తే అంతే వరద బయటకు వెళ్ళగా నేటి పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. చెరువుకిందున్న నాలాను అనుకొని పలు వెంచర్లు అండగా చెరువు నీరు వెళ్లే నారాయణ సైతం తమ సొంత భూమి అని కొందరు వ్యక్తులు వచ్చి శుక్రవారం వేస్టేజ్ తో కూల్చారు ఈ క్రమంలో ప్రస్తుతం నాలా పూర్తిగా కబ్జాకు గురవుతున్నది. అయితే నాలా అంతా కబ్జా అవుతుండగా చెరువు నుంచి వరద బయటకు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో స్థానిక కాలనీలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయి. ఈ విషయంలో అధికారులు ప్రజాప్రతినిధులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో అక్రమణ లు జరుగుతున్నాయి అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మామిడికుంట ఆక్రమణ..
RELATED ARTICLES


