హైదరాబాద్, నిఘా న్యూస్: ఇంటిముందు ఆడుకుంటు న్న చిన్నారిని ఎక్కడ నుంచి వచ్చిందో చిరుత ఆడుకుంటున్న చిన్నారిపై దాడి చేసింది. అంతటితో ఆగకుండా.. ఆ చిన్నారితో తన నోటితో కరుచుకొని.. అడవుల్లోకి లాక్కెళ్లింది.ఈ ఘటన వాల్పరైలో శుక్రవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో కోయంబత్తూర్లోని వాల్పరై పట్టణానికి సమీపంలోని పచ్చమలై ఎస్టేట్లోని సౌత్ డివిజన్లో చోటు చేసుకుంది.చిన్నారి రోష్ని, జార్ఖండ్కు చెందిన టీ ఎస్టేట్ కార్మికుడు మనోజ్ కుండ్ కుమార్తె. ఆమె ఇంటి ముందు ఆడుకుంటుండగా సమీపంలోని టీ తోట నుండి ఒక చిరుతపులి వచ్చి ఆమెపై దాడి చేసి, ఆమెను లాక్కెళ్లింది. ఈ సంఘటనను గమనించిన ఎస్టేట్ కార్మికులు అప్రమత్త మై గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే గంటల తరబడి ప్రయత్నించినప్పటికీ బిడ్డ ఆచూకీ లభించలేదు. దీంతో రోష్ని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. టీ ఎస్టేట్లో పనిచేసేందుకు పాపం వారు గత ఆదివారమే పని కోసం జార్ఖండ్ నుండి వాల్పరైకి వచ్చారు. ఇంతలో తమ చిన్నారికి ఇలా జరిగింది. చిన్నారిపై దాడి చేసి లాక్కెళ్లిన పులి.. ఆమెను ఏం చేసి ఉంటుందో అని అంతా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.