హైదరాబాద్, నిఘా న్యూస్: దేశ రాజధాని ఢిల్లీ తో పాటు.. పలు ఉత్తరాది రాష్ట్రాల్లో గురువారం ఉదయం భూకంపం సంభవించింది కొన్ని క్షణాల పాటు బలమైన భూప్రంక నాలు సంభవించాయి, భూప్రకంపనలు చోటుచేసు కున్నాయి. భూకంపం తీవ్రత రెక్టార్ స్కేల్పై 4.1గా నమోదు అయింది. భూమి ఒక్కసారిగా కంపించటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీతో పాటు ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో స్వల్పంగా భూమి కంపించింది.భూకంపం రావటానికి కొన్ని గంటల ముందు ఎన్సీఆర్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. పలు రోడ్లు నదులను తలపించాయి. దీంతో ట్రాఫిక్కు అంతరా యం కలిగింది. రోడ్డుపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
ఇక, మెట్రో స్టేషన్లు, పిల్లర్ల మీద నుంచి నీరు జలపాతంలాగా కిందకు పడింది. కొన్ని చోట్ల రోడ్డుపై నిలిపిన వాహనాలు నీటిలో టైర్ల వరకు మునిగిపోయా యి. ఓ రోడ్డుపై మోకాలి వరకు నీళ్లు రావటంతో బైకర్లు చాలా ఇబ్బందిపడ్డారు.