నిఘా న్యూస్: (ఏప్రిల్ 03-2024)న్యూఢిల్లీ ఏప్రిల్ 3 ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు తీహార్ జైల్లో ముప్పు పొంచి ఉన్నట్టు అధికారులకు సమాచారం అందింది. దీంతో వారు అప్రమత్తమయ్యారు. అదేకారాగారంలో ఉన్న కొన్ని గ్యాంగులు పాపులర్ అయ్యేందుకు ఆయనపై దాడి చేసే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రస్తుతం తిహార్ జైల్ నెంబర్ 2 లో కేజ్రీవాల్ ఉన్నారు. గతంలో ఇక్కడ హత్యలు జరిగాయి 2021లో శ్రీకాంత్ రామస్వామి అనే నిందితుడిని ఇక్కడ గ్యాంగ్ వార్లో చంపేశారు. ఢిల్లీలోని వసంత్ విహార్ వద్ద 2015లో జరిగిన ఓ హత్య కేసులో అతడిని అరెస్టు చేశారు.
సహకాయితీలు అతడిని బ్యాట్లతో తీవ్రంగా కుట్టినట్లు జైలు అధికారులు కోర్టుకు నివేదించారు అప్పట్లో ఆ కేసుకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశారు. ఇటీవల కూడా జైల్లో జరిపిన తనిఖీల్లో 33 ఫోన్లు బయటపడ్డాయిఇప్పటికే కలుస్తానే ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను నుండి కేజ్రీవాల్ కు బెదిరింపులు వచ్చాయి తిహార్ జైల్లోని కలిస్తానీలు దాడి చేస్తారని వాటిలో హెచ్చరించారు ఈ మేరకు ఇటీవల వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే….