ఆసుపత్రి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసిన రాంగోపాల్ పేట్ పోలీసులు
హైదరాబాద్, నిఘా న్యూస్:సంధ్య థియేటర్ తొక్కి సలాటలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు. కాసేపటి క్రితం ఆయన కిమ్స్ ఆసు పత్రికి వెళ్లారు.అల్లు అర్జున్ రాకముందే అక్కడకు సినీ నిర్మాత దిల్ రాజు చేరుకున్నారు. అల్లు అర్జున్ రాక నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.పెద్ద ఎత్తున అభిమానులు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిస లాటలో శ్రీతేజ్ తల్లి రేవతి మృతి చెందిన సంగతి తెలిసిందే.బాధిత కుటుంబానికి పలువురు సినీ ప్రముఖులు ఆర్థిక సాయం అందించారు. అల్లు అర్జున్ కూడా తన వంతు సాయం అందిం చారు.