అమరావతి, నిఘా న్యూస్:ఏపీలో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏపీపీఎస్సీ కీలక అప్ డేట్ ఇచ్చింది. మెయిన్స్ పరీక్షలను ఈ ఏడాది మే 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించినట్లు తెలిసింది,. ఈ మేరకు అధికారికంగా తేదీలను కూడా విడుదల చేసింది.
ఇక గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను డిస్క్రిప్టివ్ టైమ్ లో నిర్వహిస్తామని ప్రశ్నాపత్రాన్ని ట్యాబుల్లో ఇవ్వాలని నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు. ప్రతి రోజు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పరీక్షలను నిర్వహించను న్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 81 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి గతేడాది మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిం చిన విషయం తెలిసిందే. మొత్తం 1,48,881 మంది ప్రిలిమ్స్ కు దరఖాస్తు చేసుకున్నారు. 4,496 మంది మెయిన్స్ కు అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు.
వివరాల ప్రకారం..
మే 3 – క్వాలిఫైయింగ్ ఎగ్జామ్,తెలుగు
మే 4 – క్వాలిఫైయింగ్ ఎగ్జామ్(ఇంగ్లీష్)
మే 5 – పేపర్ 1(జనరల్ ఎస్సే)
మే 6 – పేపర్ 2(ఇండియా, ఏపీ చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం)
మే 7 – పేపర్ 3 పాలిటీ)
మే 8 – పేపర్ 4 ఇండియా, ఏపీ ఎకానమి) మే
9 – పేపర్ 5(సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్)