నిఘా న్యూస్, సరుకు: అరకులోయ మండలంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది . మండలంలోని మాదల పంచాయతీ పరిధిలోకి వచ్చే దుమ్మ గుడ్రి – గంజాయి గుడ గ్రామాల మధ్యలో మూడు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మహాశివరాత్రి సందర్భంగా గంజాయి గుడ జాతరకు వెళుతున్న సందర్భంలో నాలుగు బైకులు ఢీకొన్నాయని , ఒక బైక్ తరువాత మరో బైక్ డికోవడం తో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ సంఘటన లో అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందగా , ఆస్పత్రిలో ఓ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలియజేశారు. అలాగే మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. వారిని విశాఖ కె జి హెచ్ కు తరలించారు. మార్గ మధ్యలో ఒకరు చనిపోయాన్నటు సమాచారం , మొత్తం మీదా ఐధుగురు మరణించారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అరకులో నాలుగు బైకులు ఢీ..అక్కడికి అక్కడే నలుగురు మృతి
RELATED ARTICLES