హైదరాబాద్, నిఘా న్యూస్:హైదరాబాద్ ఫిలింనగర్ పరిధిలోని జుహి ఫెర్టిలిటీ సెంటర్లో ఈరోజు తెల్లవా రుజామున అగ్నిప్రమాదం సంభవించింది.షార్ట్ సర్క్యూట్ తో ఈ అగ్నిప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది, ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం వాటిలి నట్లు సమాచారం. పక్కనే ఉన్న ఆకాష్ స్టడీ సెంటర్కి మంటలు వ్యాపించాయి.
అదే బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న రిలయన్స్ ట్రెండ్స్కు మంటలు అంటుకున్నాయి. దాంతో గ్రౌండ్ ఫ్లోర్లో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. భవనం వెనుక భాగంలో హాస్టళ్లు ఉండటంతో హాస్టల్లో ఉన్నవారిని పోలీసులు ఖాళీ చేయించారు. ఓవైపు భారీగా మంటలు ఎగిసి పడుతుంటే.. మరోవైపు దట్టమైన పొగ అలుము కుంది.రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది,మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది.


