Sunday, August 3, 2025

కల్తీ కల్లులో కట్లపాము..

నాగర్ కర్నూలు జిల్లా, నిఘా న్యూస్:నాగర్ కర్నూల్ జిల్లా బిజినే పల్లి మండలం లట్టుపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గురువారం రాత్రి కల్లు తాగేందుకు వెళ్తే అతను తీసుకున్న సీసాలో కట్ల పాము కనిపించడంతో కంగుతిన్నాడు గురువారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్తు లంతా కోపంతో కల్లు దుకాణాన్ని ధ్వంసం చేశారు.

కల్లు దుకాణంలో కల్లు సీసా కొని, రెండు గుటకలు వేయ డం తో నోటి కాడికి రావడం తో దానిని ఉమ్మిలియడం తో అందులో నుంచి కట్లపాము పిల్ల బయట పడింది,ఇదంతా అక్కడే ఉన్న గ్రామస్తులంతా చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇదేంటని కల్తీ కల్లు తయా రు చేసే యజమానిని ప్రశ్నించగా బిత్తిరి చూపులు చూశాడు.

దీంతో కోపంతో రగిలి పోతూ గ్రామస్తులంతా దుకాణాన్ని కల్లు సీసాలను ధ్వంసం చేశారు. డబ్బులకు ఆశపడి కల్తీ కల్లు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కల్తీ యజమానులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయంపై పూర్తి విచారణ చేసే కల్లు యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖను కోరారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular