సదాశివపేట్ కౌన్సిలర్ల ఆడియో లీక్
ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వారికే మద్దతంటున్న వైనం
కోట్లు ఖర్చు చేసేందుకు సైతం సిద్ధమంటున్న నేతలు
పదవిని కాపాడుకునేందుకు చైర్మన్ ల ఆరాటం
సంగారెడ్డి, నిఘా న్యూస్: సంగారెడ్డి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురి మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం నోటీసులు అందజేస్తున్నారు.దీంతో కౌన్సి లర్లకు గిరాకీ పెరిగింది. తమకు ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వారికే తమ ఓటు వేస్తామంటూ నిర్మో మాటంగా చెబుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే నర్సాపూర్ తో పాటు నారాయణఖేడ్ లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం పెట్టి రెండు స్థానాల్లో కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోంది. తాజాగా సదాశివపేట మున్సిపాలిటీ రాజకీయాలు కూడా అవిశ్వాసానికి సి అంటున్నాయాయి. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే కావడంతో అదనంగా ఒక ఓటు వచ్చే అవకాశం ఉంది. కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 9న ఓటింగ్ నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. దానికి తోడు చైర్మన్ ఆశిస్తున్న కౌన్సిలర్లు ప్రస్తుత చైర్మన్ పిల్లోడి జయమ్మ పై వ్యతిరేకత ఉన్న వారంతా కాంగ్రెస్ పార్టీతో కలిసి గోవా టూర్ కి వెళ్లారు. వీరు నేరుగా అసమతి తీర్మానం బల నిరూపణ సమయానికి సమావేశ మందిరంలోకి తీసుకువచ్చేలా సదరు కౌన్సిలర్లు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ వ్యవహారం అంతా మీడియాలో రావడంతో జీర్ణించుకోలేని కౌన్సిలర్లు వార్తలు రాసిన జర్నలిస్టులపై అక్కసు వెళ్ళగక్కుతున్నారు. సదాశివపేట మున్సిపల్ పరిధి లోని మహేశ్వరీ అనే కౌన్సిలర్ భర్త వీరేశం గతంలో చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారు. అందుకు ఒక్కొక్క కౌన్సిలర్ కు 50 నుంచి లక్ష రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. ఇంతలోనే శాసనసభ ఎన్నికలు రావడంతో అవిశ్వాస తీర్మానం అంశం కాస్త జాప్యం జరిగింది. మరో కౌన్సిలర్ తాను చైర్మన్ కు నిలబడుతున్నానని కౌన్సిలర్లు ఎంత కావాలంటే అంత ఇస్తానంటూ టూర్ లో ఉన్న కౌన్సి లర్లకు ఎరా వేశారు. దీంతో విహారయాత్రలో ఉన్న కౌన్సిలర్లు ఒకరు తమకు ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వారికే తమ ఓటు వేస్తామంటూ డిమాండ్ చేస్తున్న ఆడియో బయటపడింది. తమకు ఒక కౌన్సిలర్ కు రెండు నుంచి మూడు లక్షలు ఇచ్చేందుకు సిద్ధం సిద్ధంగా ఉన్న తనకు మద్దతు ఇవ్వాలంటూ కోరారు. పిల్లోడి జయమ్మ కొడుకు కూడా కౌన్సిలర్.. అమ్మను పదవిలో నుంచి దింపేందుకు తనకు ఇబ్బంది లేదు కానీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ చెప్పిన దాని ప్రకారం డబ్బులు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాం కదా.. అన్ని వార్డుల్లో కూడా సమాన పనులు ఇవ్వమంటే ఇస్తానని చెప్పాను. అయినా అవిశ్వాస తీర్మానం నోటీసు పెట్టడం మంచిది కాదంటూ కౌన్సిలర్లకు చైర్మన్ కొడుకు చెప్పడంతో అదంతా తమకు తెలియ దని, నాకు ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వారికే ఓటు అంటూ తేల్చి చెప్పిన ఆడియో లీక్ అయింది. ఇదిలా ఉండగా ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుందా లేదా అనేది అధికారులే తేల్చాల్సి ఉంది. మరోవైపు గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఒక వ్యక్తి చైర్మన్ అయ్యేందుకు క్యాంప్ రాజకీయాలు నిర్వహిస్తున్నట్లు విశ్వాసనీయంగా తెలిసింది. మరి క్యాంపు రాజకీ యాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాలి.