హైదరాబాద్, నిఘా న్యూస్:తెలంగాణలో విద్య వ్యవస్థ లో ప్రతిష్టాత్మకమైన మార్పులు తీసుకురావాలని యోచిస్తున్న రేవంత్ రెడ్డి, సర్కార్ ప్రయోగాత్మకమైన అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా యంగ్ ఇండియా రెసిడెన్షి యల్ స్కూళ్ల ఏర్పాటుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు కీలక ఆదేశా లు జారీ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో ఇవాళ శుక్రవారం విద్యా శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతీ నియోజకవర్గంలో నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్థలాల సేకరణ, ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వంద నియోజవర్గాల్లో నిర్దే శిత గడువులోగా పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి, ఆదేశించారు. నియోజకవర్గాల్లో స్థలాల కేటాయింపుల్లో పూర్తయిన వాటికి అనుమతులకు సంబంధించిన పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రతిపాదిత స్థలాలు రెసిడె న్షియల్ స్కూల్స్ ఏర్పాటు కు అనువుగా ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు.అనువైన స్థలం లేని చోట ప్రత్యామ్నా య స్థలాన్ని సేకరించాలని సూచించారు. కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేసి వీలైనంత త్వరగా స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి స్థలాల గుర్తిం పు ప్రక్రియకు సంబంధించి వారం రోజుల్లో రిపోర్ట్ అందించాలని చెప్పారు. ఇప్పటికే స్థల సేకరణ జరిగిన నియోజకవర్గాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.రెండేళ్లలో 105 నియోజకవర్గాల్లో అన్ని రకాల మౌలిక వసతులతో వందశాతం పనులు పూర్త య్యేలా చర్యలు తీసుకో వాలని ఆదేశించారు.
వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం లో ఆ స్థాయి ప్రమాణాలతో సరైన మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ప్లే గ్రౌండ్, అకాడమిక్ బ్లాక్, ఇతర సౌకర్యాలను భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళి కలు సిద్ధం చేయాలని చెప్పారు.