వేములవాడ రూరల్ పోలీస్ల పని తీరు భేష్
వేములవాడ, నిఘా న్యూస్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా వేములవాడ రూరల్ పోలీస్ల ఉత్తమ సేవలకు గుర్తింపుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహేష్ బి. గితే మరియు జిల్లా కలెక్టర్ గరిమా అగర్వా చేతుల మీదుగా ఈ ప్రశంసా పత్రాలు అందించారు. వేములవాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, వేములవాడ రూరల్ ఎస్ఐ వెంకట్రాజం, కానిస్టేబుల్స్ రాజశేఖర్, తిరుపతి, వెంకటేష్ లు తమ ఉత్తమ పనితీరుతో ప్రశంసా పత్రాలు అందుకోవడం విశేషం. వారి సేవలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయని అధికారులు అభినందించారు.


