Tuesday, June 24, 2025

శ్రీవారి దర్శనానికి ముందస్తు ముడుపులు

విఐపి లీటర్స్ ఇవ్వడంలో చేతివాటం

  • పలువురు ప్రజాప్రతినిధుల ‘పిఏ’ ల నిర్వాకం

కరీంనగర్, నిఘా న్యూస్:ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లేందుకు వీఐపీ దర్శనం కోసం పలువురు ప్రజాప్రతినిధుల పీఏలకు ముడుపులు చెల్లించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కువగా శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వెళుతుంటారు. అయితే త్వరగా దర్శనం చేసుకునేందుకు పలువురు ప్రజాప్రతినిధులు విఐపి లీటర్స్ ఇస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అయితే ఆ లెటర్ ఇచ్చే ముందు కొందరు ప్రజాప్రతినిధుల పిఏలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఒక్క లీటర్ ఇవ్వడానికి 10 నుంచి 20వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. శ్రీవారి దర్శనానికి వెళ్లేందుకు ఇలా వసూలు చేయడం సరికాదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణలోని కరీంనగర్ జిల్లా నుంచి తిరుపతి వెళ్లేందుకు వారంలో రెండు సార్లు రైలు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే పలువురు వారి వారి పరిచర్య ద్వారా జిల్లాలోని కొందరు ప్రజాప్రతినిధులను విఐపి దర్శనం కోసం సంప్రదించగా వారి పీఏలు మాత్రం చేతివాటం ప్రదర్శిస్తున్నారు. డబ్బులు ఇస్తేనే శ్రీవారిని దర్శించుకునేందుకు లీటర్స్ ఇస్తున్నారు. దేవుడిని దర్శించుకునేందుకు వెళ్ళితే ఇలా వసూలు చేయడంపై పలువురో అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ తంతు జిల్లాలో ఎక్కువగా జరుగుతున్నట్లు బోగట్ట. ఏదేమైనప్పటికీ శ్రీవారి దర్శనం మాత్రం ముందస్తు ముడుపులతో ముడిపడి ఉండడం గమనార్హం.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular