Wednesday, March 4, 2026

ఏసీబీ తనిఖీలపై చర్యలు ఎప్పుడో

అవినీతి అధికారులకు శిక్ష తప్పదా

వేములవాడ ఆగస్టు 27 (నిఘా న్యూస్) పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరుగాంచి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 22న ఏసీబీ వారు మూడు రోజులపాటు తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే మూడు రోజులపాటు జరిగిన తనిఖీలలో అధిక మొత్తంలో అక్రమ సరుకులు నిలువ ఉన్నట్టు కనుగొన్నట్లు అయినా గాని చర్యలు మాత్రం శూన్యమేనని ఆలయ సిబ్బంది గుసగుసలు పెట్టుకోవడం విశేషం గతంలో పలుమార్లు విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలన అక్రమార్జనకు అలవాటుపడ్డ అవినీతి అధికారులకు భయం లేకుండా పోయింది అందుకే ఇస్తా రాజ్యాంగ వ్యవహరిస్తున్నారు ఏసీబీ అధికారులు తనిఖీ చేసిన ఎలాంటి చర్యలు ఉండవా అని ఆలయ సిబ్బందితోపాటు వేములవాడ పట్టణ ప్రజలు అయోమయంలో ఉన్నారు ఇప్పటికైనా ఏసీబీ అధికారులు ఉన్నదా అధికారులు ప్రజల అయోమయాన్ని తొలిగేటట్టు అక్రమాలకు పాల్పడుతున్న ఉద్యోగులను గుర్తించి వారి ఆసులపై దాడులు నిర్వహించి వీరి బాగోతం మొత్తం బట్టబయలు చేసి ఎంతటి వారినైనా విడిచి పెట్టేది లేదని ప్రజలకు తెలిసేటట్టు ఏ సమయంలోనైనా దాడులు నిర్వహిస్తామని అక్కమాగ్రంలో వెళ్లే అధికారుల ఆట కట్టిస్తామని అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగులపై కేసులు పెట్టి శిక్షలు పడేలా చేసి ప్రతి ఒక్కరికి తెలిసేలా ఈ దాడులపై చర్యలు ఉండాలని మరి ఎవరైనా అధికారులు అక్రమాలకు పాలు పడాలని ఆలోచన వస్తేనే భయపడేలా చర్యలు తీసుకోవాలని వేములవాడ పట్టణ ప్రజలు మరియు భక్తులు కోరుతున్నారు

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular