Thursday, June 26, 2025

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం..

తిరుమల మార్చ్ 17( నిఘా న్యూస్ ) తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లన్ని నిండిపోయి. లుపల క్యూ లైనులో వేచివున్నారు భక్తులు. ఇక నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 74, 351 మంది దర్శించుకున్నారు.అలాగే.. నిన్న ఒక్క రోజే…తిరుమల శ్రీవారికి 34, 164 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.04 కోట్లుగా నమోదు అయింది. ఇక అటు తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది టీటీడీ పాలక మండలి. రేపటి నుంచి జూన్‌ నెల దర్శన టికెట్లు రిలీజ్‌ కానున్నాయి. ఈ నెల 18వ తేదీ అంటే రేపటి నుంచి 27వ తేదీ వరకు ఆన్ లైన్ లో జూన్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ పాలక మండలి.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular